Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్లీ పెరిగిన ఎల్పీజీ ధర
posted on: Jun 1, 2026 9:37AM

ఎల్పీజీ ధర మళ్లీ పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. సోమవారం (జూన్ 1) నుంచే ఈ పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ పెంపుతో కోల్కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 53.50 రూపాయలు పెరిగి పెరిగి 3,255.50 రూపాయలకు చేరుకుంది. వీటితో పాటు ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (ఎఫ్టీఎల్) సిలిండర్ ధర కూడా 11 రూపాయలు పెరిగి 821.50 రూపాయలకు చేరింది.
గత నెలలో కమర్షియల్ సిలిండర్పై ఏకంగా రూ. 993 పెంచిన విషయం తెలిసిందే. ఆ భారీ పెంపుతో పోలిస్తే తాజా వడ్డన చాలా తక్కువ. మరోవైపు, సబ్సిడీ కింద ఇచ్చే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను స్థిరంగా ఉంచారు.


.webp)



