మళ్లీ పెరిగిన ఎల్పీజీ ధర

posted on: Jun 1, 2026 9:37AM

ఎల్పీజీ ధర మళ్లీ పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. సోమవారం (జూన్ 1) నుంచే ఈ పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో  ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై   42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ  పెంపుతో కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా  53.50 రూపాయలు పెరిగి పెరిగి  3,255.50 రూపాయలకు చేరుకుంది. వీటితో పాటు ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (ఎఫ్టీఎల్‌) సిలిండర్ ధర కూడా  11 రూపాయలు పెరిగి  821.50 రూపాయలకు చేరింది.  

గత   నెలలో  కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచిన విషయం తెలిసిందే. ఆ భారీ పెంపుతో పోలిస్తే తాజా వడ్డన చాలా తక్కువ. మరోవైపు, సబ్సిడీ కింద ఇచ్చే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను స్థిరంగా ఉంచారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...