విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు లోకేష్ శంకుస్థాపన

posted on: Nov 13, 2025 8:26AM

విశాఖలో మరో భారీ ప్రాజెక్టుకు గురువారం (నవంబర్ 13) శంకుస్థాపన జరగనుంది. దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే అంటే గురువారం (నవంబర్ 13) లోకేష్ విశాఖ రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. విశాఖ ఎండాడలోని మనోరమ హిల్స్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీని వల్ల కనీసం 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...