Latest News

మెటా గ్లోబల్ పాలసీ హెడ్ తో లోకేష్ భేటీ

posted on: Jan 22, 2026 11:36AM

దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి  నారా లోకేశ్  సోషల్ మీడియా దిగ్గజం  మెటా  గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్‌తో   భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్యా  ఏపీలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చ జరిగింది.   విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఆ సంస్థ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా భారీగా పెంచడంపై చర్చ జరిగింది.

అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ భాగస్వామ్యంతో  రియాలిటీ ల్యాబ్స్-ఫోకస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. అంతే కాకుండా  రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు వాట్సాప్ ఆధారిత సేవలను పెంచాలని కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని, మెటాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని లోకేష్  సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...