Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లాలూ దంపతులకు జడ్ ప్లస్ భద్రత తొలగింపు
posted on: Jun 6, 2026 5:24PM

లాలూ ఇంటి వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా..
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది. అయితే ఈ చర్యను లాలూ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమకు ప్రభుత్వం కేటాయించిన భద్రత వద్దంటూ ఇంటి నుంచి పోలీసులను పంపేసింది. దీంతో పాట్నాలోని 10- సర్క్యులర్ రోడ్లోని లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, నేతలు కర్రలతో కాపలా కాస్తున్నారు.
ఇక, బిహార్ ప్రతిపక్ష నేత హోదాలో లాలూ కుమారుడు తేజస్వీయాదవ్కు వై-ప్లస్, అలాగే ఎంపీ మిసా భారతికి ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించనున్నట్లు బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్కు మాత్రం ప్రస్తుతం ఉన్న వై-ప్లస్ భద్రతను తొలగించి.. ఓ కానిస్టేబుల్ను కేటాయించింది. ఈ పరిణామాలపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనకు కల్పించిన వై-కేటగిరీ భద్రతను వెనక్కి పంపారు. దీనిపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య దీనిపై స్పందిస్తూ.. తమ కుటుంబానికి హాని తలపెట్టాలనే దురుద్దేశంతోనే జడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు






