రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఈ
posted on: Feb 4, 2026 2:09PM

హైదరాబాద్ నగరంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతు న్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెం డింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) చిన్నారెడ్డి ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. నిర్మాణ అనుమతులు, బిల్లుల మంజూరు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఆయన, రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ చేశారు.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే చిన్నారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తో జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. చిన్నారెడ్డి పట్టుబడిన వెంటనే ఏసీబీ అధికారులు కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయన చాంబర్తో పాటు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతర అధికారుల గదులను కూడా పరిశీలించారు. అనుమానాస్పద పత్రాలు, లంచాల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం...కేవలం ఈ లంచం కేసుతోనే కాకుండా, చిన్నారెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయనకు స్థిర, చరాస్తులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అవసరమైతే ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ వంటి కీలక శాఖలో ఉన్న ఉన్నతాధికారి అవినీతికి పాల్పడటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇలాంటి అధికారుల వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై చిన్నారెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.






