Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం...ప్రధాని కార్యాలయం పేరు మార్పు
posted on: Feb 14, 2026 2:06PM

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని కార్యాలయం పేరును సేవతీర్థ్గా మార్చాలని నిర్ణయించారు. అలాగే ఢిల్లీ- అంబాలా మధ్య 2 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. గుడబెళ్లూరు-మహబూబ్నగర్ 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబ్నగర్ , నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ - పనాజీ కారిడార్లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది.
80 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్ల ఖర్చు చేయనుంది. దమాసియా - బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది. గోతి- ట్రిమ్బక్ - పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం రూ.3320 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గోహుపూర్ - నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది.


.webp)



