Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ బెదిరింపు సెక్షనేంటో!
posted on: Jun 27, 2015 7:59PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సెక్షన్ 8, సెక్షన్ 10 గురించి తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. ఈ రెండు సెక్షన్లూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నిప్పుల కుంపటిని మరింతగా రాజేస్తున్నాయి. ఈ రెండు సెక్షన్ల గొడవ ఇలా వుంటే, మరో సెక్షన్ కూడా ఇప్పుడు జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. జనం సంగతి అలా వుంచితే, సాక్షాత్తూ గవర్నర్ గారినే అయోమయానికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఈ విషయంలో ఏం చేయాలి చెప్మా అని కేంద్రం తలుపు తట్టారు. ఇంతకీ ఆ సెక్షన్ ఏమిటంటే, ‘బెదిరింపు సెక్షన్’. ఈ సెక్షన్ని అమలు చేస్తోంది మరెవరో కాదు... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ బెదిరింపు ఏమిటనుకుంటున్నారు... తమకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తాననే బెదిరింపు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఈ బెదిరింపుతో అందర్నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిన గవర్నర్ నరసింహన్ ఇదే విషయాన్ని ఆయనతో చెప్పి ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదన్నట్టుగా మాట్లాడారన్న వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి పారేస్తానని కేసీఆర్ బెదిరించారట. కేసీఆర్ గారికి ఇలా బెదిరించాలన్న ఐడియా ఎలా వస్తోందో ఏంటో. ఇలా బెదిరిస్తే పనులు అయిపోతాయని అనుకోవడం ఎంతవరకు న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో ఓసారి ఆయన ఈ బెదిరింపు సెక్షన్ అమలు చేసేసరికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది దారిలోకి వచ్చినట్టున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవకపోతే అసెంబ్లీనే రద్దు చేస్తానని కేసీఆర్ బెదిరించారు. ఆ బెదిరింపు కారణంగానే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిక్కురుమనకుండా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో తన బెదిరింపు సెక్షన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు సెక్షన్ 8 విషయంలో కూడా అదే బెదిరింపు సెక్షన్ని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు.


.jpg)



