Latest News

కావూరు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

posted on: Mar 15, 2026 6:49PM

 

ఇటీవల అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కుటుంబ సభ్యులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని కావూరు నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా కావూరు సాంబశివరావు అందించిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...