తమిళనాట అన్నామలై క్రేజ్...24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!

posted on: Jun 6, 2026 9:04PM

 

తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల కోసం అంటూ..  ‘ఉయ్ ద లీడర్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చేరాలనే అన్నామలై పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. దానికి ముందు ‘వి ద లీడర్స్’ ఉద్యమాన్ని ప్రకటించారు. 

తమిళనాడు ప్రజల హక్కులకోసం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. ఆయన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. భారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఉద్యమానికి ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా మద్దతు తెలుపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షలు మంది చేరినట్టు వెబ్‌సైట్‌‌లో నమోదయ్యింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...