జూబ్లీ బైపోల్.. కౌంటింగ్ వేళ ఇండిపెండెంట్ ఆభ్యర్థి మృతి
posted on: Nov 14, 2025 9:05AM
.webp)
జూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అన్వర్.. కౌంటింగ్ సందర్భంగా తీవ్ర టెన్షన్ కు లోనై గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 40 ఏళ్లు.
ఎర్రగడ్డలో నివాసముండే మహ్మాద్ అన్వర్ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ఓటమి భయం, ఆందోళనే ఆయన మరణానికి కారణమని అంటున్నారు.






