జైలు నుంచి విడుదలైన జోగి రమేష్

posted on: Jan 23, 2026 8:01PM

 

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు విచారణాధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన్ 83 రోజుల తర్వాత జోగి రమేష్ బెయిల్‌పై బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు. 

ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు జోగి రమేష్ తెలిపారు. అవసరమైతే నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తానని, చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబుని కూడా కోరానని అన్నారు. అయినప్పటికీ కుట్రతో తనను అరెస్టు చేశారని ఆరోపించారు. అమ్మవారి ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానని జోగి రమేష్ తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...