కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... నలుగురు మృతి
posted on: Feb 3, 2026 8:16PM
.webp)
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలం మొగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ట్రాక్టర్ లో 15 మంది మహిళలు ప్రయాణిస్తుండగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.






