కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... నలుగురు మృతి

posted on: Feb 3, 2026 8:16PM

 

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  మల్లాపూర్ మండలం మొగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ట్రాక్టర్ లో 15 మంది మహిళలు ప్రయాణిస్తుండగా  పలువురు గాయపడ్డారు.  గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...