వ్యవసాయ రుణాలపై జగన్ ద్వంద వైఖరి
posted on: Jun 25, 2014 4:51PM
.jpg)
చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీచేయకుండా కమిటీల పేరుతో ప్రజలను మోసపుచ్చుతోందని, దానివలన రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న శాసనసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. తమ కోసం తమకంటే ఎక్కువగా జగనే ఆవేదన పడటం చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ మూడు కూడా తనకు సమానమని చెప్పుకొన్న జగన్మోహన్ రెడ్డి, తమ గురించి మాత్రం ఎందుకు ఆవేదన పడటంలేదని తెలంగాణా రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రైతులకు అన్యాయం చేస్తున్నాడని విరుచుకుపడే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కంటే ముందుగా బాధ్యతలు చేప్పట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోయినా, ఆయనను మాత్రం ఈవిషయంలో ఎందుకు నిలదీయడంలేదో ఎవరికీ తెలియదు. అంటే కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది గనుక, అతనికి తెలంగాణా రైతన్నల గోడు పట్టదు. కానీ చంద్రబాబుతో అతనికి పడదు గనుక, ఆంద్ర రైతన్నల గురించి ప్రశ్నిస్తున్నారను కోవాల్సి ఉంటుంది. అంటే జగన్ ఆసక్తి అంతా రైతన్నల గురించి కానీ, వ్యవసాయ రుణాల మాఫీ గురించి కానీ కాదని కేవలం తనకు అధికారం దక్కకుండా అడ్డుపడిన చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనని అర్ధమవుతోంది. విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా ద్వంద వైఖరి కనబరచడం వలననే ప్రజల విశ్వసనీయత కోల్పోయి ఎన్నికలలో ఓడిపోయారు. కానీ ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ వ్యవసాయ ఋణాలపై ద్వంద వైఖరి ప్రదర్శించడం అలవాటులో పోరాపాటనుకోవాలేమో!



.jpg)
.jpg)

.webp)



