సీమాంధ్ర ఫలితాలు: జగన్‌ని నమ్మని ఓటర్లకి సెల్యూట్

posted on: May 17, 2014 2:44PM

 

 

 

సీమాంధ్రలో అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి పదవిని ఎక్కడంతోపాటు, సీమాంధ్రలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు గెలిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. సీమాంధ్ర ఓటర్లు జగన్ పార్టీని అధికారానికి చాలా దూరంగా తరిమికొట్టారు. జగన్ తన ధనబలం ఉపయోగించి సీమాంధ్ర మొత్తాన్నీ తన వైపు తిప్పుకోవాలని చూశారు. అయితే జగన్ పప్పులు ఎంతమాత్రం ఉడకలేదు. జగన్ పార్టీని మరీ ఘోరంగా ఓడించకుండా కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ అధికారాన్నికి ఆమడ దూరంలో వుంచేలా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రానికి జగన్ సంపాదించిన సింగిల్ అంకె ఎంపీ సీట్ల అవసరం కేంద్రానికి లేదు. ఇప్పుడు ఈ పార్లమెంటు సీట్లు చూపించి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనమీద వున్న కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కూడా జగన్‌కి లేకుండా పోయింది. మొత్తంమీద జగన్‌కి ఇలాంటి పరిస్థితి తెచ్చిన ఓటర్లకు సెల్యూట్ చేయాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...