జగన్ రాత్రుళ్లు ఏం చేస్తున్నాడో తెలుసా..?

posted on: Dec 22, 2017 4:52PM


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పేరుతో యాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే కదా. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇక పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్..మరి రాత్రి పూట ఏం చేస్తున్నాడబ్బా.. ? ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్ రాత్రిళ్లు మాత్రం కొందరు నాయకులతో సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నారట. ఇంతకీ ఎవరో మంతనాలు జరుపుతున్నారు అనుకుంటున్నారా..? ఇంకెవరూ.. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తోనే మాట్లాడుతారు..? ఆయన సలహాలే తీసుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు కదా..? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జగన్ మాట్లాడుతున్నాడంటే...  వైఎస్ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో టెలికాన్ఫరెన్సులో మాట్లాడతారట. అయితే ఈ విషయం ఎలా తెలిసిందంటారా...?  శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయవాడలో దీనిపై విమర్శలు గుప్పించారు. జగన్‌ ఓ పగటి వేషగాడని.. అతని పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని.. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలుతున్నారని బుద్దా ఘాటుగా విమర్శించారు. దీంతో విషయం బయటపడింది. మరి జగన్ అండ్ కో బ్యాచ్ సీక్రెట్ టెలికాన్ఫరెన్సుల గురించి ఏమంటారో చూద్దాం మరి.

google-ad-img
    Related Sigment News
    • Loading...