జగన్ కేసులలో మళ్ళీ చలనం

posted on: Jun 26, 2014 10:13PM

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మళ్ళీ చలనం మొదలయింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గనులశాఖలో సహాయక డైరెక్టర్ గా చేసిన శంకర నారాయణ రఘురాం సిమెంట్స్ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఆయనను విచారణ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ సీబీఐ చేసిన అభ్యర్ధనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో, సీబీఐ కోర్టు ఆయనకు వచ్చే నెల21న కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేసింది. చంద్రబాబు అధికారం చేప్పట్టిన తరువాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమ నీరు, భూమి తదితర కేటాయింపులపై కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పడమే కాకుండా, రెండో మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులతో కూడిన కమిటీ కూడా వేసారు. అందువలన త్వరలోనే ఆ కమిటీ కూడా పని ప్రారంభిస్తే తీగ లాగితే డొంక కదిలినట్లుగా మళ్ళీ జగన్ వ్యవహారాలు వెలుగులోకి రావచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...