హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం

హైదరాబాద్‌ నగరంలో ఆదాయపు పన్ను శాఖ   విస్తృత సోదాలు కలకలం రేపుతున్నాయి.  మంగళవారం (నవంబర్ 18)  తెల్లవారు జాము నుంచి ఐటీ అధికారులు  నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో  ఏకకాలంలో ఈ ఐటీ సోదాలు సాగుతున్నాయి.  పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటీ దృష్టి సారించింది.

ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ ఆదాయంపై అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో  ఈరెండు హోటల్‌లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య భాగస్వాముల ఇళ్లలో  కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ రంగంలో భారీ స్థాయిలో జరుగుతున్న లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ దాడులు  నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నగరవ్యాప్తంగా జరుగు తున్న ఈ సోదాల్లో అధికారులు బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల రికార్డులు, డిజిటల్ డేటా, అకౌంటింగ్ వివరాలు, డాక్యుమెంట్లు వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu