కేటీఆర్ కు తగ్గని ఫీవర్! యశోద హాస్పిటల్ లో అడ్మిట్

posted on: May 1, 2021 2:33PM

కరోనా సోకిన తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత నెల 23న కేటీఆర్ కు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేటీఆర్.. అప్పటినుంచి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే  రెండ్రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతుండడంతో కేటీఆర్ ను హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు.

కేటీఆర్ ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...