అగ్రరాజ్యం అధీనంలో ఇస్లామాబాద్.. ఏం జరుగుతోంది?

posted on: Apr 10, 2026 11:04AM

అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి.. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో  అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే  అమెరికా అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ టీమ్ అమెరికాకు చేరుకుంది. 

శాంతి చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ ప్రతినిథుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి చర్చలు శనివారం (ఏప్రిల్ 11) నుంచి మొదలు కానున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేందుకు ఈ చర్చలు అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లో భద్రతా ఏర్పాట్ల వ్యవహారం అంతా అమెరికా చూస్తున్నది. ఇస్లామాబాద్ చేరుకోనున్న అమెరికా ప్రతినిథుల బృందం రక్షణకు సంబంధించి అమెరికా పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది.   

శాంతి స్థాపన దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ  చర్చలు అత్యంత కీలకమైన నేపథ్యంలో  భద్రతా బాధ్యతలను అమెరికాకు అప్పగించిన పాకిస్థాన్.. తమ పోలీసులు, సైనిక దళాలు అమెరికా సెక్యూరిటీ బృందానికి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...