ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు

posted on: Dec 15, 2025 7:47PM

 

ఏపీ మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కి బెయిల్‌ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బ తగిలింది.

తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...