అమ్మవారి అన్నప్రసాదాలు అద్భుతం...భక్తుల ప్రశంసలు

posted on: May 31, 2026 4:23PM

 

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, క్యూ లైన్‌లో ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అనంతరం మొదటి అంతస్తులో బఫే విధానంలో, రెండో అంతస్తులోని కామన్ హాల్‌లో భోజనం చేస్తున్న భక్తులను కలిసి అన్నప్రసాదాల రుచి, నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదాలు ఎంతో రుచిక రంగా, నాణ్యంగా ఉన్నాయని, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసిం చారు. భక్తుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఈవో సంతృప్తి వ్యక్తం చేయగా, అన్నప్రసాదాల నిర్వహణలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంద్ర కీలాద్రి క్షేత్రంలో భక్తులకు అందిస్తున్న అన్నసేవపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...