Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హోటల్లో వస్తువులు చోరీ చేస్తూ పట్టుబడ్డ ఇండియన్ టూరిస్టులు
posted on: Apr 22, 2026 5:41PM

ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలో భారతీయ పర్యాటకులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విలాసవంతమైన హోటల్లో బస చేసిన నలుగురు భారతీయులు, అక్కడి వస్తువులను తమ లగేజీలో దొంగతనంగా దాచుకుని బయటకు వెళ్తుండగా హోటల్ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఏప్రిల్ 16న బాలిలోని ఉబుద్ ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ రిసార్ట్లో ఈ పర్యాటకులు చెక్-ఇన్ అయ్యారు. ఏప్రిల్ 19న వారు చెక్-అవుట్ అవుతున్న సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది. గదిని పరిశీలించగా కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో, వెంటనే స్పందించిన సిబ్బంది ఆ పర్యాటకుల లగేజీని తనిఖీ చేయాలని కోరారు.
సిబ్బంది సమక్షంలో లగేజీని తెరవగా, లోపల హోటల్కు చెందిన బాత్ టవల్స్, పూల్ టవల్స్, కిమోనో రోబ్స్, హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, డైనింగ్ యూటెన్సిల్స్ (పాత్రలు) మరియు టీవీ రిమోట్ బాక్స్లు కనిపించాయి. హోటల్ గదిలో ఉండాల్సిన వస్తువులు వారి సూట్కేసుల్లో ఉండటం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. చెక్-అవుట్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, నిలదీయడంతో సదరు పర్యాటకులు చిక్కుల్లో పడ్డారు. అయితే, ఎటువంటి పోలీసు ఫిర్యాదులు లేకుండా, వివాదాన్ని అక్కడికక్కడే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలు అంగీకరించాయి. తీసుకున్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయడంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భారతీయుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తనే మన దేశ ప్రతిష్టను చాటి చెబుతుందని, ఇలాంటి పనులు దేశ గౌరవాన్ని దిగజారుస్తాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విలాసవంతమైన హోటల్లో బస చేయగల సామర్థ్యం ఉండి కూడా, ఇలా చిన్న చిన్న వస్తువుల కోసం కక్కుర్తి పడటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు విదేశీ పర్యటనల్లో భారతీయుల ప్రవర్తనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒక పర్యాటకులుగా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకులు తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.



.webp)


