ముంబైకి రైల్వేశాఖ గిఫ్ట్..ఏసీతో లోకల్ ట్రైన్

posted on: Apr 4, 2016 4:37PM

 

ఆధునికత దిశగా అడుగులు వేస్తున్న భారతీయ రైల్వేలు ప్రజలకు మరో గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు లోకల్ ట్రైన్ అంటే ఫుట్‌పాత్‌లపై వేలాడే జనాలు చెమటలు తుడుచుకుంటూ ఇరుకు ఇరుకుగా ప్రయాణం సాగించేవారు. కానీ ఇక నుంచి ఇలాంటి వాతావరణం మారిపోబోతోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఏసీ సౌకర్యంతో లోకల్ ట్రైన్ ప్రవేశపెట్టనుంది. ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకోలేకపోతున్న నేపథ్యంతో పాటు లోకల్ రైళ్లలో ప్రయాణించి ఆలసి సొలసి ఆఫీసులకు వెళ్తుండటంతో రైల్వే శాఖ దీనికి చెక్ పెట్టాలనుకుంది. దీనిలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఏసీ లోకల్ ట్రైన్‌ను నడపాలని సంకల్పించింది. 55 కోట్ల విలువైన ఈ రైలు చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. ప్రస్తుతం దీనిని చెన్నై నుంచి ముంబైకి తరలిస్తున్నారు. మిగిలిన సాంకేతికపరమైన పనులను ముంబైలోనే పూర్తి చేసుకుని నెల రోజుల వ్యవధిలో దీనిని పట్టాలెక్కించనున్నారు. ఈ రైలులో జనరల్. ఫస్ట్‌క్లాస్ అంటూ విడివిడిగా లేవని, అంతా ఒకేలా ఉంటుందని అయితే మహిళల కోచ్‌లు గుర్తించడానికి మార్కింగ్స్ ఉంటాయని అధికారులు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో ఈ సదుపాయాన్ని అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...