Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్-చైనా యుద్ధం ఆయుధాలతో కాదు అమ్మాయిలతో..?
posted on: Aug 4, 2017 2:26PM
.jpg)
భారత్, చైనా, భూటాన్ సరిహద్దులోని డోకా-లా ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకోవడం ద్వారా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి తోడు 1962 నాటి భారత్ కాదని రక్షణమంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యానించడం..ఆ వెంటనే మాది కూడా 1962 నాటి చైనా కాదని బీజింగ్ హెచ్చరించడంతో ఆసియాలో అలజడి రేగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుదేశాల బలబలాలపై ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. యుద్ధం అంటే మామూలు విషయం కాదు కదా..? అందుకే సామధానభేద దండోపాయాలను ఉపయోగించి విజయం సాధించడానికి చైనా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎంతటివాడైనా కాంతాదాసుడే అన్నట్లు అందమైన అమ్మాయిలతో వల విసురుతోంది. ఈ మేరకు భారత నిఘా సంస్థలు జారీ చేసిన హెచ్చరికలు రక్షణ శాఖను ఉలిక్కిపడేలా చేశాయి. లాహోర్ వేదికగా అందమైన పాక్, చైనా యువతులు అనర్ఘళంగా హిందీ, ఉర్ధూ, ఇంగ్లీష్ మాట్లాడుతూ, వల విసురుతారని త్రివిధ దళాల అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ఆధారంగా వారు తమ పని కానిచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపాయి. వారి వలకు ఏమాత్రం చిక్కినా..? ఇక వారి పని అయిపోయినట్లేనని ఇంటెలిజెన్స్ తెలిపింది. సీక్రెట్ వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తారని..ప్రధానంగా ఆర్మీ స్థావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు ఆ అమ్మాయిలు ప్రయత్నిస్తారని తెలిపాయి. ముందు నుంచి కొట్టే దెబ్బ కంటే వెనుక నుంచి కొట్టే దెబ్బకు ఎంతటి వాడైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే ఎంతైనా మంచిది.





