Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
posted on: Apr 29, 2026 8:55PM

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్.ఎం.ఆర్) ప్రాజెక్టు ఫేజ్-1ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన మెట్రో కార్యకలాపాలు, ఇకపై తెలంగాణ ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించనుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎల్ అండ్ టీ ప్రతినిధుల మధ్య బుధవారం హైదరాబాద్లో అధికారికంగా షేర్ పర్చేజ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)లో ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాలను రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,461.47 కోట్ల విలువతో కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కీలక ఒప్పందం వల్ల మెట్రోకు ఉన్న సుమారు రూ. 13,538 కోట్ల అప్పులను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే గ్యారెంటీతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా రీఫైనాన్స్ చేయనున్నారు. మెట్రో నిర్వహణ భారాన్ని తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా మెట్రో రెండో దశ (Phase-II) ప్రణాళికలను అమలు చేయడంలో ప్రభుత్వానికి మరింత వెసులుబాటు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. మొదటి దశ మరియు రెండో దశ మెట్రో వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
2017 నవంబర్లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో సేవలందిస్తోంది. నిత్యం సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులు దీనిని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 86 కోట్ల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించి, నగర ప్రజా రవాణాలో కీలక భాగంగా నిలిచారు.
ప్రభుత్వ పరమైన నిర్ణయాలు, విధానాల్లో మార్పుల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మెట్రో సేవల్లో మరిన్ని ఆధునిక మార్పులు వచ్చే అవకాశం ఉందని నగరవాసులు ఆశిస్తున్నారు. మెట్రో విస్తరణతో పాటు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నారు. ఈ పరిణామం హైదరాబాద్ నగరాభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.



.webp)


