బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

posted on: Feb 28, 2026 2:44PM

కాకినాడ జిల్లా సామర్ల కోట సమీపంలోని వేట్ల పాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 18 మంది మరణించారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేట్లపాలెంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం (ఫిబ్రవరి 28) ఈ పేలుడు సంభవించింది.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. వేట్లపాలెం గోదావరి కెనాల్‌ పక్కనే ఉన్న  ఓ బాణాసంచా కేంద్రంలో  భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.   పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...