శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి, నగదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

posted on: Nov 13, 2025 8:15AM

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కష్టం సార్ అధికారులు నిఘా నేత్రాలతో ప్రతి ఒక్క ప్రయాణికుడి కదలికలను పర్యవేక్షిస్తునా కూడా ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా స్మగ్లర్లు అక్రమరవాణాకు ప్రయత్నిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు.  తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు వేర్వేరు సంఘటనల్లో అక్రమంగా తీసుకువస్తున్న భారీ మొత్తంలో నగదు, గంజాయి, సెల్ ఫోన్ లను అధికారులు సీజ్ చేశారు. ఈ మూడు ఘటనలూ మంగళవారం (నవంబర్ 11) జరగాయి. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలకు అనుమానాస్పదంగా ఉండటంతో అతడి బ్యాగును తనిఖీ చేసిన అధికారులకు ఆ బ్యాగులో పెద్ద ఎత్తున హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

దీంతో అధికారులు వెంటనే  అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 కోట్ల రూపాయల విలువైన 4.3 కిలోల   హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇంకా ఇక అదే రోజు  మరో  ప్రయాణికుడి బ్యాగు నిండా ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అతని వద్ద నుండి పది ఐఫోన్ 17 ప్రో మాక్స్, 55  ఐఫోన్ 17 ప్రో, పది ఆపిల్ వాచ్ ఎస్ఇ,  పది ఐ వాచ్ ఎస్ఇ,  ఎనిమిది డీజేఐ ఎయిర్ 3ఎస్ డ్రోన్లు, నాలుగు  నింటెండో స్విచ్ 2, ఒక  శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7, ఒక  హెచ్ఎండీ ఫోన్  ఒక నంబర్ గూగుల్ పిక్సెల్ వాచ్ 3 లను  స్వాధీనం  చేసుకున్నారు. అలాగే అదే రోజు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల చెక్-ఇన్ బ్యాగేజీ నుండి రూ.71,71,407ల నగదును కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...