మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

posted on: Apr 4, 2026 10:09AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మండుగురు మరణించారు. నాసిక్ జిల్లా దిండోరి తాలూకాకు చెందిన దర్గోడే కుటుంబం  శివాజీనగర్‌ ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం శుక్రవారం (ఏప్రిల్ 3) శుక్రవారం రాత్రి  మారుతి ఎక్స్‌ఎల్ కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తిరుగు  ప్రయాణంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  రోడ్డు పక్కన నీటితో   బావిలోకి దూసుకెళ్లింది.

రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం   పోలీస్ లు,  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో చిన్నపిల్లలే ఎక్కువమంది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...