Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బహదూర్గూడలో హైటెన్షన్.. పోలీసుల కళ్లల్లో కారం చల్లిన రైతులు.!
posted on: Jul 18, 2026 6:01PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గత ఐదు రోజులుగా ప్రభుత్వ భూముల అంశంపై రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా, శనివారం(జులై 18) పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావర ణాన్ని తలపించింది. శనివారం (జులై 18) ఉదయం రైతుల తో మాట్లాడిన ఆర్డీఓ శ్రీధర్, వివాదాస్పదంగా ఉన్న 650 ఎకరాలు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు. ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టా భూములుగా మారవని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే సుమారు 400 ఎకరాలు ఇతరులకు విక్రయించా రని.. ప్రస్తుతం బయటి వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు.
అయితే మిగిలిన భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. అయితే అధికారులు చర్చలు కొనసాగుతుండగానే ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది జేసీబీలతో పనులు ప్రారంభించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పనులను అడ్డుకు నేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించే క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసు కుంది. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులు పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరినట్లు సమాచారం. అంతేకా కుండా కొందరు రైతులు పోలీసుల కళ్లలో కారం చల్లడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటనలో శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఐలు గాయప డ్డారు.
ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


.webp)



