నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు

posted on: May 21, 2026 7:23PM

 

ఎండల తీవ్రతతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలలో 48.1, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం. సుర్యాపేట జిల్లా మునగాలతో 46.5 డ్రీగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని కృష్ణాజిల్లా నందివాడ, బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమైదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4, మహబూబాబాద్ జిల్లా కురవిలో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి.  తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.  గురువారం హైదరాబాద్‌లో ఎండల తీవ్రత చాలా అధికంగా ఉంది, గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 24 మధ్య వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగి కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచే భానుడి భగభగలు, వడగాల్పుల తీవ్రత ప్రారంభమవుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...