Latest News

భానుడు భగభగలు ...40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

posted on: Mar 7, 2026 2:47PM

 

తెలంగాణలో మార్చి మొదటి వారంలో ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.  గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలి తీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని పేర్కొంది. 

ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వారు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.   మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...