Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...26 వరకూ ఏపీ నిప్పుల గుండమే!
posted on: May 19, 2026 9:30AM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కాగా ఈ హీట్ వేవ్ మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 26 వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు బుధవారం ( మే 20) నుంచి 26వ తేదీ వరకు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి అనిపిస్తుంది.






