సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్
posted on: Feb 12, 2026 5:14PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే చంద్రబాబును దూషించిన కేసు, పీపీపీ ఆందోళన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులలో బెయిలు లభించినా.. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో, 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల నుంచి అక్రమంగా రెండు వందల రూపాయల చొప్పునరూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేసి బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులోనే అంబటిని పీటీ వారంట్ పై గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టగా అంబటికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.






