Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎంనే కంటతడి పెట్టించింది..
posted on: Jun 10, 2016 6:00PM

దేశంలో నానాటికి తగ్గిపోతున్న స్తీ, పురుష లింగ నిష్పత్తి గురించి మాట్లాడి సాక్షాత్తూ ముఖ్యమంత్రినే కంటతడి పెట్టించింది ఓ బాలిక. గుజరాత్లోని ఖేడా జిల్లా మహుదా పరిధిలోని హెరంజి గ్రామానికి చెందిన బాలిక అంబికా గోహెల్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో వారి స్కూలు ప్రాంగణంలో భ్రూణ హత్యల గురించి ఒక సభ జరిగింది. ఆ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబికా చదివి వినిపించింది.
తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, కాని ఆ అవకాశాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేదని మృత శిశువు ఆవేదనను కళ్లకు కట్టింది."నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలో నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తుంచుకో ఆడపిల్ల లేకుంటే ఇల్లు ఇల్లే కాదు" అంటూ భావోద్వేగంతో ఆ లేఖను చదివింది. అంబికా ఆ లేఖ చదువుతున్నంతసేపు వేదికపై కూర్చున్న ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరూ కంటతడి పెట్టారు. బాలిక ప్రసంగించిన వెంటనే సీఎం కూర్చీలోంచి లేచొచ్చి అంబికాను అప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలిక తనకు డాక్టర్ కావాలని ఉందని ఆనందీతో చెప్పడంతో అందుకు తగిన సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తానికి తన ప్రసంగంతో సీఎంనే చలించేలా చేసిన అంబికా అభినందనీయురాలు.



.jpg)


