ఆర్సీబీపై గుజరాత్ సునాయాస విజయం

posted on: May 1, 2026 9:23AM

ఐపీఎల్ 2026  గురువారం (ఏప్రిల్ 30) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో  గుజరాత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. ఆర్సీబీని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగాన్ని తెచ్చాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ (19 బంతుల్లో 39) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్-ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు  వికెట్ నష్టానికి 69 పరుగులు. 

అయితే.. మధ్యలో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని రంగరించి గుజరాత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కీలకమైన గిల్, బట్లర్‌లతో పాటు మరో వికెట్ తీసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపాడు. 92 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన దశలో, రాహుల్ తెవాటియా తనదైన శైలిలో ఫినిషర్ పాత్ర పోషించాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో మరో 25 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం ఖాయమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఒక మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బెంగళూరు బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కీలక వికెట్లు త్వరగా కోల్పోవడం ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రాణించినప్పటికీ, బ్యాటర్లు తక్కువ స్కోరు నమోదు చేయడం బెంగళూరు ఓటమికి ప్రధాన కారణమైంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...