Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
posted on: May 15, 2026 1:00PM
.webp)
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శుక్రవారం ( మే 15) శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా.. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


.webp)



