ఒక పరాజయం 100 తప్పులు.. 'రాజకోట' రహస్యం
posted on: Jul 22, 2019 6:34PM

ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే గత ఐదేళ్ళలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో బాబు సత్సంబంధాలు కొనసాగించలేదనేది వాస్తవం. నిజానికి నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ నియమించిన ఎందరో గవర్నర్లు మారిపోయారు కానీ.. నరసింహన్ మాత్రం అలాగే కొనసాగారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగారు. అప్పుడు బాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. నరసింహన్ తమకి అంత అనుకూలంగా లేరని కూడా తెలుసు. అయినా బాబు ఎందుకనో ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించండని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అదే బాబు చేసిన తప్పని కొందరి అభిప్రాయం. తరువాత బాబు బీజేపీకి దూరమయ్యారు. నరసింహన్ మాత్రం బీజేపీకి దగ్గరై గవర్నర్ గా కొనసాగుతూ వచ్చారు. బాబు, గవర్నర్ ల మధ్య దూరం కూడా.. టీడీపీని అధికారానికి దూరం చేసి, ప్రతిపక్షానికి పరిమితం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గవర్నర్ తో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాబుకి దూరమవ్వడంలో గవర్నర్ పాత్ర ఉందని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా గవర్నర్ బాబుని ఒంటరిని చేసారని కూడా అంటుంటారు. ఈ అంశంపై పూర్తీ విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.





.webp)

.webp)


