తిరుమల భక్తులకు శుభవార్త

posted on: Feb 9, 2026 2:31PM

 

తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. లడ్డూ  విక్రయ కేంద్రాల వద్ద నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో అమలు చేసి దాని ఫలితాల ఆధారంగా అన్ని కౌంటర్లకు విస్తరించాలని భావిస్తోంది. దీని వల్ల కియోస్క్‌ యంత్రాల వద్ద పెరుగుతున్న రద్దీ తగ్గడమే కాకుండా చిల్లర సమస్యలు లేకుండా భక్తులు శ్రీవారి భక్తులకు వేగంగా లడ్డూలు పోందే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.  

తిరుమల స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల(ఫిబ్రవరి) 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో రాత్రి వేళ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...