Latest News
చెత్తకుప్పలో బంగారం
posted on: Mar 7, 2026 1:54PM
.webp)
చెత్తకుప్పలో బంగారం లభ్యమైంది. దాదాపు 18 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు అభరణాలు ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి చెత్త కుప్పలో దొరికాయి. నిరుపేద అయినా ఆమె తనది కాను సొత్తు కోసం ఏమాత్రం ఆశపడలేదు. పరుల సొమ్ము పాములాంటిదని భావించిన ఆ సొమ్మను ఆమె పోలీసుల సహాయంతో ఆ బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న వారికి అందజేసింది.
ఈ సంఘటన తమిళనాడులోని శివగంగలో జరిగింది. పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీకి చెత్తకుప్పలో బంగారు ఆభరణాలు కనిపించడంతో వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసుల సాయంతో ఆ అభరణాలను వాటి సొంతదారులకు అందించింది. పిల్లలు పొరపాటున బంగారు ఆభరణాలను చెత్తలో పారేశారని తెలిసింది. సెల్వీ నిజాయితీకి ఫిదా అయిన ఆ బంగారు ఆభరణాల సొంతదారులు ఆమెకు 20 వేల రూపాయలు నజరానా ఇచ్చారు.


.webp)



