Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రేమ వివాహమే ప్రాణాలు తీసింది...గోల్కొండ హత్య కేసును ఛేదించిన పోలీసులు
posted on: Jun 15, 2026 3:57PM

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం కారణంగా పెరిగిన కుటుంబ విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం గోల్కొండలోని కుమ్మరవాడికి చెందిన షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి (26) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడు 2025 జనవరిలో రుక్షార్ బేగమ్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని రుక్షార్ సోదరుడు షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28) తీవ్రంగా వ్యతిరేకించాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి మసూద్పై ద్వేషం పెంచుకున్న సోహైల్ తరచూ గొడవలకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్లో దంపతులకు కుమారుడు జన్మించాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగాయి. ఇటీవల సోహైల్ తన తల్లి షమీమ్ బేగమ్, సోదరి రూబీలతో కలిసి మసూద్ ఇంటికి వెళ్లి గొడవ పడి, తన సోదరిని మసూద్తో కలిసి జీవించనివ్వ బోనని, వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో జూన్ 12న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28)తన బంధువులైన జీషన్ నవాబ్ అలియాస్ జాబర్(30), అమీర్ నవాబ్ అలియాస్ లడ్డు(26/, జాబర్ తల్లి నఫీజ్ సుల్తానా(48)తో కలిసి కుమ్మరవాడిలోని మసూద్ ఇంటికి వెళ్లారు. ఇనుప రాడ్లు, కత్తి, కర్రలతో ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి మసూద్పై దాడికి పాల్పడ్డారు.
మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిందితులు వారిని తోసిపుచ్చి దాడి కొనసాగించారు. సోహైల్ ఇనుప రాడ్తో మసూద్ తలపై బలంగా కొట్టగా, జాబర్ కత్తితో తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో లడ్డు, నఫీజ్ సుల్తానా కర్రలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన మసూద్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అతని తండ్రి షేక్ ఇస్మాయిల్పై కూడా దాడి చేయడంతో ఆయనకు చేతి, చెంపపై గాయాలయ్యాయి.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు కింద 103(1), 329(4), 118(1) రీడ్ విత్ 3(5)తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 1959లోని సెక్షన్ 25(1A) కింద కేసు నమోదు చేశారు. టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి జూన్ 13న నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయో గించిన జిమ్ ఇనుప రాడ్, కత్తిని స్వాధీనం చేసుకు న్నారు.ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం, కుటుంబ విభేదాలు మరియు వ్యక్తి గత కక్షలే ఈ దారుణ హత్య కు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






