గోదావరి పుష్కర ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష.!

posted on: Aug 14, 2026 12:20PM

దక్షిణది  కుంభమేళాగా  చెప్పుకునే  గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది.   పుష్కరాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలనీ, పుష్కర స్నాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలనీ నిర్ణయించింది.  అలాగే పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  

గోదావరి నది తీరప్రాంతాలు..  బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని చారిత్రక, ప్రాచీన దేవాలయాల శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్  సబ్ కమిటీ ఈ సందర్భంగా అధికారులకు   దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, ఘాట్ల నిర్మాణం, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత ఏర్పాట్లపై చర్చించింది. కేబినెట్ సభ్ కమిటీలో   మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,   సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఉన్నారు.  గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణతో పాటు దేశ,  విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

Godavari Pushkaralu, Telangana Cabinet Sub Committee, Sridhar Babu, Basara to Bhadrachalam, Telangana News, TelugiOne

google-ad-img
    Related Sigment News
    • Loading...