Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో కూడా బ్రేక్ పడనుందా?
posted on: Jul 31, 2014 4:03PM
.png)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై వచ్చే ఏడాది మార్చి31వరకు కొత్తగా ఎటువంటి పన్నులు విధించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీఓను హైకోర్టు నిలిపివేసింది. ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల విషయంలో కూడా ప్రస్తుత విధి విధానాలు, ప్రమాణాలనే పదేళ్ళపాటు యధాతధంగా కొనసాగించాలని బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం స్థానికత అంశం లేవనెత్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు చెప్పట్టకుండా జాప్యం చేస్తోంది. దీనిపై కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక కేసు నడుస్తోంది. కానీ ఆ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘స్థానికత అంశం’ ప్రస్తావించకుండా కౌన్సిలింగ్ నిర్వహించడానికి తమ వద్ద తగినంతమంది అధికారులు, సిబ్బంది లేరు గనుక మరికొంత గడువు కావాలని కోరడం గమనార్హం. ఈకేసులో ఇంప్లీడ్ అవబోతున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఈ స్థానికత అంశాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చి, విభజన బిల్లుకు వ్యతిరేఖంగా తెలంగాణా ప్రభుత్వం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తోందని సమర్ధంగా వాదించగలిగితే, ఈ విషయంలో కూడా తెలంగాణా ప్రభుత్వానికి అవమానకర పరిస్థితులు ఎదుర్కోక తప్పకపోవచ్చును.


.jpg)
.jpg)


