మోడీ యురోపియ‌న్ మెలోడీస్

posted on: May 22, 2026 9:56AM

 

మోడీ యూర‌ప్ టూర్ వింత‌లూ విశేషాలు వివాదాలు విచిత్రాలు ఎలాంటివి? ఆయ‌న ఈ టూర్ లో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు?  లేడీ జ‌ర్న‌లిస్టు వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర  నుంచి మెలోనీ మెలోడీ, టాఫీ డిప్ల‌మ‌సీ వంటి వివ‌రాలేంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు దేశాలైన యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ.. దేశాల‌తో కూడిన‌ యూరప్ పర్యటన అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ పర్యటనలో ఎన్నో కీలక ఒప్పందాలు, వీటితో పాటు కొన్ని వివాదాలు, మరికొన్ని విచిత్రమైన వ్య‌వ‌హారాలు, నెటిజన్లను ఆకట్టుకున్న వింత‌లూ విశేషాలు చోటుచేసుకున్నాయి.  

మెలోనీ-మెలోడీ, టాఫీ డిప్లమసీ. ఈ టూర్ మొత్తంలో సోషల్ మీడియాను షేక్ చేసిన అతిపెద్ద విశేషం ఇది. మెలోడి క్రేజ్: గతంలో జీ-20, ఇతర సదస్సుల్లో మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల కలయికను నెటిజన్లు  మెలోడి అంటూ మీమ్స్, రీల్స్‌తో వైరల్ చేసిన సంగతి తెలిసిందే.

టాఫీ డిప్లమసీ విష‌యానికి వ‌స్తే.. ఈసారి రోమ్‌లో మెలోనిని కలిసిన ప్రధాని మోడీ, ఆమెకు భారతదేశానికి చెందిన ప్రసిద్ధ  పార్లే మెలోడీ టాఫీ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు.

మెలోని ఆ చాక్లెట్ ప్యాకెట్‌ను చూపిస్తూ,  పీఎం మోడీ మాకోసం చాలా చాలా మంచి టాఫీ తీసుకొచ్చారు.. అదే మెలోడీ  అంటూ నవ్వుతూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో వీడియో పెట్టారు.

ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే.. భారతదేశంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో  మెలోడీ  చాక్లెట్లు క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. అంతేకాదు, సంబంధం లేని  పార్లే ఇండస్ట్రీస్  అనే లిస్టెడ్ కంపెనీ షేర్లు కూడా స్టాక్ మార్కెట్లో అప్పర్ సర్క్యూట్ తాకడం ఒక విచిత్రం!

ఇక‌పోతే లేడీ జర్నలిస్టు వ్యవహారం. ఈ పర్యటనలో కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నార్వే పర్యటనలో మీడియా వ్యవహారం చర్చనీయాంశమైంది.  నార్వే పర్యటనలో ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడి ఒక లేడీ జర్నలిస్టు.. భారతదేశంలో మైనారిటీల హక్కులు, ప్రెస్ ఫ్రీడమ్ మోడీ సాధారణంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతుంటారు అనే అంశాలపై బహిరంగంగానే ప్రశ్నించారు.

దీనిపై భారత అధికారులు గట్టిగానే స్పందించారు. భారతదేశం ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను, మైనారిటీల హక్కులను కాపాడుతుందని, వేధింపులకు గురైన ఎందరో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర భారత్‌కు ఉందని సమాధానమిచ్చారు.

ఇదే సమయంలో నార్వేకు చెందిన ఒక మీడియా సంస్థ మోడీని ఉద్దేశించి వేసిన ఒక కార్టూన్/చిత్రం జాతి వివక్ష పూరితంగా ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
 
ఈ టూర్ లో జరిగిన ప్రధాన ఒప్పందాలు ఎలాంటివో చూస్తే.. వినోదం, వివాదాలు పక్కన పెడితే.. వ్యూహాత్మకంగా ఈ పర్యటన చాలా విజయవంతమైందిగా చెప్పాల్సి ఉంటుంది. IMEC ప్రాజెక్ట్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్.: ఇటలీ, నెదర్లాండ్స్‌తో జరిగిన చర్చల్లో ఈ మెగా కారిడార్‌ను వేగవంతం చేయడంపై కీలక అడుగులు పడ్డాయి.

గ్రీన్ ట్రాన్సిషన్- క్లీన్ ఎనర్జీ: నార్వే, స్వీడన్ దేశాలతో కలిసి పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్,  పర్యావరణ పరిరక్షణ సాంకేతికతపై భారత్ ఒప్పందాలు చేసుకుంది. ఇటలీ, స్వీడన్ దేశాలతో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్టనర్‌షిప్, మారిటైమ్ సెక్యూరిటీ అంటే, సముద్ర తీర రక్షణ. ఉమ్మడి సైనిక సాంకేతికత అభివృద్ధిపై చర్చలు జరిగాయి. స్వీడన్ పర్యటనలో ప్రధాని మోడీకి ఆ దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం సైతం లభించింది.

కార్ డిప్లమసీ, కొలోసియం వాక్ విష‌యానికి వ‌స్తే..  రోమ్ నగరంలో మోడీ, మెలోనిలు ఒకే కారులో ప్రయాణిస్తూ, అక్కడి వీధుల్లో మాట్లాడుకుంటూ వెళ్లడం-కార్ డిప్లమసీ. అలాగే రాత్రి వేళ చారిత్రాత్మక కొలోసియం కట్టడం దగ్గర కలిసి నడుస్తూ దిగిన ఫోటోలు అంతర్జాతీయంగా  సాఫ్ట్ పవర్ డిప్లమసీ కి సరికొత్త ఉదాహరణలుగా నిలిచాయి.

మొత్తంగా చూస్తే.. సీరియస్ బిజినెస్ ఒప్పందాలు, నార్వే జర్నలిస్టుల వివాదాలు, ఇత‌ర‌ సోషల్ మీడియాను ఊపేసిన  మెలోడీ టాఫీ  విశేషాలతో ప్రధాని మోడీ యూరప్ పర్యటన సరికొత్త రికార్డులను సృష్టించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...