జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విస్తరణ ప్రక్రియ పూర్తి

posted on: Dec 3, 2025 8:51PM

 

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలియం చేస్తూ తీసుకున్న ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి ..ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఒక సర్కిల్ జారీ చేశారు ..27 మున్సిపాలిటీలు, కమిషనర్లలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకి ఆదేశాలు ఇచ్చారు..

జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్‌లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇవాళ ఆమోదించారు. దీంతో మొత్తం 27 స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...