Latest News

గంటా రాజకీయాలు టీడీపీలో వర్కవుట్ అవుతాయా?

posted on: May 20, 2014 3:52PM

 

పార్టీలు మారడంలో స్పెషలిస్టు అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీలో వున్న సమయంలో, ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి మారినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ పంచలో చేరినప్పుడు గంటా తనదైన శైలిలో రాజకీయాలు ప్రదర్శిస్తూ పదవులు పొందుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా ఎమ్మె్ల్యేగా ఎన్నికయ్యారో లేదో ఇలా రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడితో గంటాకి ఎంతమాత్రం పడటం లేదని వినికిడి. జిల్లానుంచి అయ్యన్న పాత్రుడిని కాదని తనకే పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో గంటా వుండటంతో అయ్యన్నకు, గంటాకు మధ్య అంతరం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా గంటా ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో గంటా ఏ స్థాయిలో ముదిరిపోయారో అర్థమవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న గంటాకి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కూడా బాగా ఒంటబట్టినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో చంద్రబాబు మంత్రి వర్గంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే చేస్తాడంట.. లేకపోతే సామాన్య కార్యకర్తగా మిగిలిపోతాడట. ఈరకంగా గంటా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినట్టుగా క్రమశిక్షణ లేకుండా తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తే కుదరదన్న విషయం గంటా మరచిపోయినట్టున్నాడని అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే గంటా తోక చంద్రబాబు కట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...