ఏపీఎస్ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. ఎప్పట్నుంచంటే?

posted on: Mar 5, 2026 10:05AM

దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.  ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ నెల 18నుంచి  అందుబాటులోకి రానుంది.  

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభిస్తారు.   40 శాతం, ఆపై  వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌక ర్యం కల్పిస్తామని ఆర్టీసీ పేర్కొంది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు,  అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చే వారికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...