రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

posted on: May 16, 2026 9:25AM

కాకినాడలో శనివారం (మే 16) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కూలి పనులకు వెడుతున్న కూలీలను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి సమీపంలో రోడ్డు దాటుతున్న కూలీలపైకి టిప్పర్ లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.   

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి తరలించారు.   వారి పరిస్థితి   విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...