రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం

posted on: Jul 1, 2026 11:10AM

పల్నాడు జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. బోయపాలెం వద్ద నేషనల్‌ హైవేపై రెండు లారీలు   ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...