Latest News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

posted on: Mar 18, 2026 6:10PM

 

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గత 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నాడు.

ఈ కేసులో పిన్నెల్లి తరఫు న్యాయవాదులు సమర్పించిన వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పిన్నెల్లి త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం పల్నాడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. ఒకే కేసులో ఇద్దరు సోదరులకు భిన్నమైన తీర్పులు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తదుపరి విచారణల నేపథ్యంలో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...