కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

posted on: Feb 23, 2026 8:00AM

కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్   కన్నుమూశారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం (ఫిబ్రవరి 22) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  ఆయన అంత్యక్రియలు సోమవారం (ఫిబ్రవరి 23) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా  అనారోగ్యంతో తీసుకుంటున్న ముకుల్ రాయ్ గత కొన్ని రోజులుగా కోమాలో ఉన్నారు.

 1998లో మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించిన ముకుల్ రాయ్, పార్టీలో నంబర్ 2 స్థాయికి ఎదిగారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ పాలనను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు.  2017లో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 18 స్థానాలు గెలవడానికి ఆయన వ్యూహాలే ముఖ్య కారణమని అంటారు.  

అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ టీఎంసీ గూటికి చేరారు.  ఆ తరువాత అనారోగ్యం కారణంగా ఆయన  క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...